News

కేవలం రెండు బస్తాలు చాలు, పక్కాప్రణాలిక తో కలెక్టర్

Sandilya Sharma
Sandilya Sharma
Sircilla agriculture review meeting, Collector Dr. Sandeep Kumar Jha (Image Courtesy: Google Ai)
Sircilla agriculture review meeting, Collector Dr. Sandeep Kumar Jha (Image Courtesy: Google Ai)

జిల్లాలోని వ్యవసాయ అధికారులు రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు (farmer services Telangana) అందించేందుకు సిద్ధంగా ఉండాలని సిరిసిల్ల కలెక్టర్ డా. సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏవోలు, ఏఈవోలకు శిక్షణ ఇచ్చారు. ధాన్యం సేకరణ, తేమ శాతం నిర్ధారణ, టోకెన్ల పంపిణీ, ఈ-క్రాప్ బుకింగ్ (e-crop booking training), మట్టి నమూనాల సేకరణ, విత్తనాల ఎంపిక, రైతు బీమా, పీఎం కిసాన్ (PM Kisan updates Sircilla) వంటి కీలక అంశాలపై వివరంగా సమీక్ష జరిపారు.

ఎరువుల వినియోగంపై హెచ్చరిక (urea usage advisory)

కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఎకరాకు రెండు బస్తాల యూరియా వినియోగించటం సరిపోతుందని, అధిక మోతాదులో ఎరువులు వాడితే పంటల నాణ్యతతో పాటు నేల కూడా నిస్సారమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.2500 విలువైన ఎరువుల బస్తాను రూ.266 సబ్సిడీ ధరకు అందించటం (fertilizer subsidy Telangana) రైతులకు పెద్ద ఊరటగా అభివర్ణించారు.

ధాన్యం సేకరణకు సక్రమమైన ప్రణాళిక

పంట కోతలు పూర్తైన రైతులకు టోకెన్లు వేగంగా అందజేయాలని, ధాన్యంలో తేమ శాతం (paddy procurement moisture) నమోదు చేసి ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు రైతు వేదికలు లేదా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

సేంద్రీయ వృద్ధిపై దృష్టి

మట్టి నమూనాల సేకరణ, విత్తనాల ఎంపిక అంశాల్లో ప్రత్యక్షంగా గ్రామాలలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలనీ, ఆధునిక సాగు విధానాలు, భద్రత పద్ధతులు గురించి వివరించాలని తెలిపారు.

వర్షాలకు ముందే చర్యలు

ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా వచ్చే వడగళ్ల వానలకు ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ పంటలు పందొమ్మిది శాతం వరి, మొత్తం లక్షా 81 వేల ఎకరాల్లో సాగు, ఇందులో 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3 వేల ఎకరాల్లో మిర్చి, కూరగాయలు సాగు జరుగుతుందని తెలిపారు.

ప్రత్యేక ఆదేశాలు

  • నీటి వనరుల అంచనాతో పంటలు వేయాలని

  • ఒకే పంటను పదే పదే వేయకుండా మార్పిడి సాగు చేయాలని

  • పంటలపై అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, మందులు వినియోగించాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జునరావు, జిల్లాలోని ఏవోలు, ఏఈవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Read More:

రూ.1600 కోట్లతో కొత్త M-CADWM ఉపపథకం ప్రారంభం, రైతులకు మంచిదేనా ?

ఇకపై దేవుడికి ‘కల్తీ ప్రసాదం’ నిషేధం! కలెక్టర్‌ సంచలన నిర్ణయం

Share your comments

Subscribe Magazine

More on News

More