Agripedia

అక్కడ పశుగ్రాసాన్ని పెంచితే చాలు ప్రభుత్వం నుండి లక్ష రూపాయల సహకారం!

S Vinay
S Vinay

హర్యానా వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి JP దలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం 'చార-బీజే యోజన' (పశుగ్రాస సాగు పథకం)ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు

వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన దలాల్, చార-బీజే యోజన కింద ఒక రైతు గోశాల చుట్టూ 10 ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పండించి పరస్పర అంగీకారం ద్వారా గోశాలలకు అందజేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. 10,000 చొప్పున 10 ఎకరాల వరకు లక్ష రూపాయల సహాయం చేస్తుంది. ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.

రాష్ట్రంలో పశుగ్రాసం కొరతను పరిష్కరించడం ఈ పథకం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) కింద సబ్సిడీ నేరుగా రైతు ఖాతాలో జమ చేయబడుతుంది.
రాష్ట్రంలో గోవధశాలల సంఖ్య 2017లో 175 నుండి 2022 నాటికి 600కి పెరిగింది. విచ్చలవిడి పశువుల జనాభా పెరుగుదల కారణంగ పశుగ్రాసం కొరత ఏర్పడింది. చాలా గోవుల ఆశ్రయాలు రద్దీగా ఉన్నాయి.
అలాగే ఆవు పేడతో తయారు చేసిన ఫాస్ఫేట్-రిచ్ ఆర్గానిక్ ఎరువు (PROM) ను సింథటిక్ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

చార-బీజే యోజన' ప్రవేశపెట్టడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, ఇది సహజ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తుందని మరియు గోశాలలు కూడా ప్రయోజనాలను పొందుతాయని మంత్రి అన్నారు. ఏప్రిల్‌లో హర్యానా రాష్ట్రంలోని 569 గోశాలలకు పశుగ్రాసం కోసం రూ.13.44 కోట్లు అందించామని వ్యాఖ్యానించారు, రైతులకు సకాలంలో నష్టపరిహారం అందేలా ఖచ్చితంగా సరైన రైతుకే క్లెయిమ్ ఇప్పించేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం డీఏపీ (Di ammonium phosphate) ఎరువుల ధర రూ.3,850 ఉండగా అందులో రూ.2,500 రైతుకు సబ్సిడీగా ఇస్తున్నామని, రైతు నుంచి రూ.1,350 తీసుకుంటున్నట్లు దలాల్ తెలిపారు. దేశంలో డీఏపీ సబ్సిడీ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు.

పశుగ్రాసం అంతర్ జిల్లాల తరలింపుపై ఎలాంటి ఆంక్షలు లేవని, అంతర్ రాష్ట్ర తరలింపుపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.1000 కోట్లు, పంట నష్టానికి రూ.600 కోట్లు ఇచ్చామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరిన్ని చదవండి.

HARDHENU COW:పాడి రైతులకి పసిడి ఆవు రోజుకి 60 లీటర్ల పాలు....

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More